చార్లెస్ డార్విన్

బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు సైన్స్ సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

చార్లెస్ డార్విన్

చార్లెస్ డార్విన్ పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది “పరిణామ సిద్దాంతం” ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముడూ ఉండేవారు. అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని తెలియజేశారు. ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్ట మొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతకి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.

చిన్నతనంలో ఆయన కీటకాలను, ఖనిఝాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. 16యేండ్ల వయస్సులో మెడిసన్ చదవటం కోసం ఈయనను ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు. కాని మత్తు మందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లను చూచి ఆ చిత్రహింసకు ఈయన కలత చెంది మెడిసన్‌ను మనసు పెట్టి చదవలేకపోయాడు. 1828లో కేంబ్రిడ్జ్‌కి వెళ్లి ‘ధియాలజీ’ చదివాడు.

డార్విన్ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో పుట్టాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. అతడొక మందబుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు. తండ్రి వైద్య విద్య కోసం ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేర్చినా డార్విన్ కొనసాగించలేకపోయాడు. ఏదో ఒక డిగ్రీ  సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో ”తత్త్వశాస్త్ర” అధ్యయనంలో చేరినా అక్కడా అంతే. అక్కడి ప్రొఫెసర్ ఓసారి అతడికి ‘బీగల్’ అనే ఓ నౌక కెప్టెన్‌కి పరిచయం చేశాడు. వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్ళు, శిలజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు. ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రింత రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో స్పష్టించలేదని, అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక ద్వారా పరిణామం చెందాయని డార్విన్ సిద్దాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్, మాలిక్యులర్ బయాజీలను డీఎన్ఏ పరీక్షల్లోనూ ఈ సిద్ధాంతం ప్రముఖ పాత్ర వహిస్తోంది.

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన “డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం” భూమి మీద జీవుల పరిణామక్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్వినిజం కీలకపాత్ర పోషించింది. కోతి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్టించలేదన్న సిద్దాంతాన్ని తెరమీదకు తెచ్చింది.

1831లో విజ్ఞానశాస్త్ర పరిశోధనల నిమిత్తం యూరోపియన్ దేశాలను చుట్టిరావటానికి డార్విన్‌కి అవకాశం లభించింది. ఈ అవకాశం ఆయన పాలిట సువర్ణావకాశమై గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణకు ఆధారభూతమైనది. అయిదేళ్ళపాటు కొనసాగిన యీ సముద్ర యానంలో డార్విన్‌ ఎన్నో రకాల ప్రదేశాలను, జంతువులను దర్శించాడు. ప్రకృతికి, జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఈ ఆలోచన ఫలితమే “ప్రకృతి వరణ వాదము” (నేచురల్ సెలక్షన్ థీరీ)గా పరిణించింది.

ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటి నుంచి లేవనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరుతపులులూ, పెద్ద పులులూ, సింహాలు మరొక జాతికి చెందినవనీ, గుర్రాలు, గాడిదలు, జీబ్రాలు ఒకలాంటివే. గతంలో వీటికి తలోక “పూర్వీకుడూ” ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ “ఆదిమ”జాతులకు జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలు, పక్షులు అన్నింటి ఆవర్భావానికి దారితీసిన ప్రేరణలు, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్ని రకాల ప్రాణులు “వాటంతట అవే” ఎలా ఉద్భవిస్తాయని ఆయన తన గ్రంథంలో వివరించారు.

ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్ట్యా తొలిమానవులు నల్లని రంగులు ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవసమూహం తెల్లగా మారిపోవడానికి 20వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నాఒక్క మనిషి జాతినే తీసుకుంటే చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణని రుజువు అవుతోంది. దీని కారణంగానే జీవపరిణామ సిద్ధాంతాన్ని బలపరిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

సరిగ్గా ఈ సమయంలోనే ఆల్ప్రెడ్ రస్సెల్ వాలెస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్దాంతాన్నే వెలువరించాడు. డార్విన్‌కు ఉత్తరం కూడా రాశాడు. 1858లో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు కూడా! ఈ పుస్తకం విడుదలైన రోజునే అన్ని ప్రతులూ అమ్ముడుపోయి సరికొత్త రికార్డును స్పష్టించింది.

జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిద్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతులు ఏర్పడటానికి మూలాధారాలు అవుతాయి. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం అయితే సృష్టి సిద్ధాంత వాదులు ఈయన వాదనను సమర్థించరు.

చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్లో “డార్వినిజం” ఎన్నో ప్రశంసలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవి శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి ఆధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.

కొన్నిక్రైస్తవ, ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమయ్యింది. సృష్టివాదాన్ని వ్యతిరేకించడం దైవ ద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిద్దాంతాన్ని నిషేదించారు.ఈ సిద్ధాంతం తప్పని జీవ పరిణామక్రం జరగలేదని వాదించేవారిలో టర్కీ దేశానికి చెందిన ఇస్లామిక్ రచయిత హారూన్ యహ్యా ఒకరు.

1868లో డార్విన్ “ది వారియేషన్ ఆఫ్ ఆనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్” అనే పుస్తకాన్ని ప్రచురించాడు. “ఇంసెక్టివోరస్ ప్లాంట్స్”, “డీసెంట్ ఆఫ్ మ్యాన్”, “ది ఫార్మేషన్ ఆఫ్ గజిటబుల్ మౌల్డ్ థ్రూ ఏక్షన్ ఆప్ వర్మ్స్” వంటివి ఈయన రాసిన మరికొన్ని పుస్తకాలు.

ఈయన 74 ఏళ్ళు వయస్సులో చనిపోయారు. సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఈయన కూడా సమాధి చేయబడటం కాక తాళీయం. డార్విన్ ఈనాడు లేకపోయిన ఆయన ప్రతిపాదించిన ప్రకృతివరణ సిద్ధాంతం ఎప్పటికి నిలిచే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *